కరోనాతో ఇరాన్ లో మరో ఎంపీ మృతి.. 4,747కు చేరిన వైరస్ సోకినవారి సంఖ్య
- మొత్తంగా 124కు చేరిన మృతుల సంఖ్య
- అందులో ఏడుగురు ప్రజాప్రతినిధులే..
- ఆ దేశంలో ఇప్పటివరకు 4,747 మందికి వైరస్
ఇరాన్ లో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తూనే ఉంది. కరోనా వైరస్ కారణంగా శనివారం ఆ దేశానికి చెందిన మరో ఎంపీ ఫాతిమా రహ్బార్ (55) చనిపోయారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి ఆమె పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే ఆ దేశ మరో ఎంపీ మహమ్మద్ అలీ రమజానీ కూడా వైరస్ కారణంగా చనిపోయారు.